తెలంగాణ

telangana

ETV Bharat / international

సౌదీలో 'ఫైజర్​' టీకా తొలి డోసు తీసుకున్న రాజు

సౌదీ రాజు సల్మాన్​ బిన్​ అబ్దులాజిజ్​.. ఫైజర్​ కరోనా వ్యాక్సిన్​ తొలి డోసు వేయించుకున్నారు. అయితే.. సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​, ఆయన సోదరుడు ఖలీద్​ బిన్​ సల్మాన్​లు ఇప్పటికే ఈ టీకాను తీసుకున్నారు.

By

Published : Jan 9, 2021, 6:26 PM IST

Saudi Arabia's King Salman receives first dose of coronavirus vaccine
సౌదీలో 'ఫైజర్​' టీకా తొలి డోసు తీసుకున్న రాజు

సౌదీ అరేబియా రాజు సల్మాన్​ బిన్​ అబ్దులాజిజ్​(85).. ఫైజర్​-బయోఎన్​టెక్​ కరోనా వ్యాక్సిన్​ తొలి డోసు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన.. నియోం నగరంలో టీకా వేయించుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ సందర్భంగా.. సల్మాన్​కు కృతజ్ఞతలు తెలిపారు అక్కడి ఆరోగ్య మంత్రి తౌఫిక్ అల్​-రబయా.

"మహమ్మారి వ్యాప్తి ప్రారంభం నుంచి నేటి వరకు ప్రజా ప్రయోజనాల కోసం ఆయన ఎంతో సహకరించారు. నేడు.. వైరస్​ నుంచి రక్షణ పొందే కరోనా వ్యాక్సిన్​ మోతాదునూ తీసుకున్నారు."

- తౌఫిక్ అల్​-రబయా, సౌదీ ఆరోగ్య మంత్రి

సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​, ఆయన సోదరుడు ఖలీద్​ బిన్​ సల్మాన్​ సహా.. ఇతర సీనియర్​ అధికారులు ఇప్పటికే టీకా తొలి మోతాదును తీసుకున్నారు.

లక్ష మందికిపైగా..

ఈ మేరకు.. గల్ఫ్​ ప్రాంతంలో ఫైజర్​ టీకా వినియోగాన్ని ఆమోదించిన రెండో దేశంగా సౌదీ నిలిచింది. బహ్రెయిన్​ ఈ జాబితాలో తొలిస్థానాన్ని దక్కించుకుంది.

అయితే.. సౌదీ వ్యాప్తంగా మూడు దశల్లో వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి దశలోనూ నిర్దిష్ట జనాభా ఆధారంగా టీకా పంపిణీ చేస్తామని పేర్కొంది. ఇందుకోసం రియాద్​, మక్కా, తూర్పు ప్రావిన్సులోని మూడు వ్యాక్సిన్​ కేంద్రాలలో.. ఇప్పటివరకు లక్ష మందికిపైగా వ్యాక్సినేషన్​ కోసం తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.

ఇదీ చదవండి:కొవిడ్​ టీకా మొదటి డోసు వేసుకున్న సింగపూర్ ప్రధాని

ABOUT THE AUTHOR

...view details