తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​లో బాంబు పేలుడు- 11మంది జవాన్లకు గాయాలు

పాకిస్థాన్​లోని సిబి జిల్లాలో సైనికులు లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది జవాన్లు గాయపడ్డారు. బలూచిస్థాన్​ వేర్పాటు వాదులు ఇదివరకు ఇటువంటి దాడులకు పాల్పడ్డారని అధికారులు పేర్కొన్నారు.

By

Published : Jan 21, 2021, 7:11 AM IST

bomb blast, pakistan, pak army
పాకిస్థాన్​లో బాంబు పేలుడు.. 11 జవాన్లకు గాయాలు

పాకిస్థాన్​లోని సిబి జిల్లాలో ప్యారా మిలటరీ బలగాలపై బుధవారం బాంబు దాడి జరిగింది. పారామిలటరీ వాహనానికి సమీపంలో సంభవించిన ఈ పేలుడి ప్రభావానికి 11 మంది జవాన్లు గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. నలుగురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని అధికారులు తెలిపారు. అయితే బలూచిస్థాన్​ వేర్పాటు వాదులు ఇదివరకు ఇటువంటి దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :హఫీజ్​ కీలక అనుచరులకు 15 ఏళ్ల జైలు శిక్ష

ABOUT THE AUTHOR

...view details