తెలంగాణ

telangana

By

Published : May 7, 2020, 4:33 PM IST

ETV Bharat / international

కరోనా ఇంకా ప్రమాదకరమే.. నిర్లక్ష్యమెందుకు?

దేశంలో కరోనా కేసులు తగ్గిపోయిన నేపథ్యంలో ఈ వైరస్​ ప్రమాద స్థాయులను అన్ని ప్రాంతాల్లో కనిష్ఠానికి తగ్గించింది చైనా. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాపారాలు, పరిశ్రమలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే.. విదేశాలలో పూర్తిస్థాయిలో వైరస్​ వ్యాప్తి కట్టడి కాలేదని.. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగదని హెచ్చరించారు అధ్యక్షుడు జిన్​పింగ్​. వ్యక్తిగత భద్రత పాటించాలని సూచించారు.

President Xi
జిన్​పింగ్​

కరోనా వైరస్​ను కట్టడి చేయటంలో సఫలమైనట్లు తెలిపేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కొవిడ్​-19 ప్రమాద స్థాయులను తగ్గించింది చైనా. దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలను హెచ్చరించారు అధ్యక్షుడు షి జిన్​పింగ్​. కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తి స్థాయిలో కట్టడి కాలేదని.. తప్పనిసరిగా వ్యక్తిగత భద్రత పాటించాలని సూచించారు.

కరోనా వైరస్​ నివారణ, నియంత్రణ మార్గదర్శక బృందంతో గురువారం సమావేశమయ్యారు అధ్యక్షుడు జిన్​పింగ్​. ఈ బృందం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. అయితే.. ప్రజలు వ్యక్తిగత భద్రతపై నిర్లక్ష్యం వహించటం తగదని హెచ్చరించారు.

"విదేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటికీ సమర్థవంతంగా కట్టడి కాలేదు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం.. ఈ మహమ్మారి నివారణ చర్యల్లో అనిశ్చితిని కలిగిస్తుంది. హుబే రాష్ట్రంలో ఈ వైరస్​ నివారణ, నియంత్రణ చర్యలను సడలించొద్దు."

– షి జిన్​పింగ్​, చైనా అధ్యక్షుడు

చైనాలోని అన్ని ప్రాంతాలు కరోనా ప్రమాద స్థాయులను గురువారం కనిష్ఠ స్థాయికి తగ్గించాయని.. చైనా అధికారిక మీడియా వెల్లడించింది. హుబే రాష్ట్రం సహా.. కరోనాకు కేంద్ర బిందువైన వుహాన్​లో ఇప్పటికే ప్రమాద స్థాయులను తగ్గించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాపారాలు, పరిశ్రమలు తెరుచుకున్నాయి.

బుధవారం ఒక్కకేసు కూడా నమోదు కాలేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ (ఎన్​హెచ్​సీ) వెల్లడించింది. అయితే.. ఇద్దరు విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్​గా తేలినట్లు తెలిపింది. హుబే ప్రావిన్స్​లో గత 33 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు.. కాగా బుధవారం లక్షణాలు కనిపించని ఆరుగురికి పాజిటివ్​గా తేలిందని వెల్లడించింది. ఇలాంటి అసిమ్టోమాటిక్​ కేసులు 880కు చేరుకున్నాయి. అయితే.. ఒక్క మరణం కూడా సంభవించలేదు. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 82,885గా ఉండగా.. మృతుల సంఖ్య 4,633గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details