తెలంగాణ

telangana

By

Published : Jun 29, 2019, 3:07 PM IST

ETV Bharat / international

జీ-20లో మోదీ: 3 రోజులు.. 20 సమావేశాలు

జపాన్​ వేదికగా జరిగిన జీ-20 దేశాల సదస్సు ముగిసిన నేపథ్యంలో భారత్​కు తిరుగు ప్రయాణం అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. మూడు రోజుల జపాన్​ పర్యటనలో భాగంగా వివిధ దేశాల అధినేతలతో మోదీ భేటీ అయ్యారు.

మోదీ

జపాన్​లోని ఒసాకాలో జరిగిన 14వ జీ-20 దేశాల సదస్సు ముగిసింది. సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ భారత్​కు తిరుగు ప్రయాణం అయ్యారు. జపాన్​లో 3 రోజుల పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ సహా అనేక దేశాల అధినేతలతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు 6 జీ-20 సదస్సులకు హాజరయ్యారు మోదీ.

భేటీల పర్వం

జపాన్​కు గురువారం చేరుకున్న మోదీ.. మొదటగా జపాన్​ ప్రధాని షింజో అబేతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులు, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జపాన్​ చక్రవర్తి 'నరుహితో' పట్టాభిషేకానికి భారత రాష్ట్రపతి హాజరవుతారని ప్రకటించారు మోదీ.

శుక్రవారం ట్రంప్​, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ రోజూ వరుస భేటీలతో తీరిక లేకుండా గడిపారు మోదీ. ఇండోనేసియా, బ్రెజిల్​, టర్కీ, ఆస్ట్రేలియా దేశాధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

విపత్తు నిర్వహణకు పిలుపు

ప్రకృతి విపత్తుల నుంచి ఉపశమనం పొందేందుకు దేశాలన్నీ కూటమిగా ఏర్పడాలని మోదీ పిలుపునిచ్చారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలను, ప్రజలను త్వరగా కోలుకునేలా అన్ని దేశాల్లో ఏర్పాట్లు జరగాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: జీ-20 సదస్సు: సభ్య దేశాలతో మోదీ భేటీ

ABOUT THE AUTHOR

...view details