తెలంగాణ

telangana

ETV Bharat / international

భూటాన్​లో 'రూపే' సేవలను ప్రారంభించనున్న మోదీ

భూటాన్​లో శుక్రవారం రెండో దశ రూపే కార్డు సేవలు మొదలుకానున్నాయి. ఆ దేశ ప్రధానితో కలిసి భారత ప్రధానమంత్రి మోదీ వర్చువల్​గా ఈ సేవలను ప్రారంభించనున్నారు.

By

Published : Nov 20, 2020, 5:03 AM IST

Updated : Nov 20, 2020, 5:53 AM IST

PM Modi, Bhutanese PM to jointly launch RuPay card Phase-II on Friday
రెండోదశ రూపే కార్డులను ప్రారంభించనున్న మోదీ, షెరింగ్​

భూటాన్​లో రెండో దశ రూపే కార్డు సేవలను.. ఆ దేశ ప్రధాని లొటాయ్​ షెరింగ్​తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. వర్చువల్​గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు విదేశాంగశాఖ తెలిపింది. దీంతో భూటాన్​వాసులు భారత్​లో తమ రూపే కార్డులను వినియోగించుకునేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంది.

గతేడాది ఆగస్టులో మోదీ భూటాన్​ పర్యటన సందర్భంగా.. తొలిదశ రూపే కార్డులను ఇరువురు ప్రధానులు సంయుక్తంగా ప్రారంభించారు. తొలిదశ రూపే కార్డులు అమలు కావడం వల్ల.. భూటాన్​లో ఏటీఎం కేంద్రాలు, పాయింట్​ ఆఫ్​ సేల్​(పీఓఎస్​) వంటి సర్వీసులు మొదలయ్యాయి. భారత్​కు చెందిన రూపే కార్డుతో డెబిట్​, క్రెడిట్​ చెల్లింపులు సహా.. ఇ-కామర్స్​ సైట్లలో అన్నిరకాల లావాదేవీలు జరుగుతాయి.

ఇదీ చదవండి:క్రిస్మస్‌కు ముందే ఫైజర్‌ టీకా పంపిణీ!

Last Updated : Nov 20, 2020, 5:53 AM IST

ABOUT THE AUTHOR

...view details