తెలంగాణ

telangana

ETV Bharat / international

విమానంలో మంటలు.. అంతా సజీవదహనం - Manila airport general manager Ed Monreal

ఫిలిప్పీన్స్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 8 మందితో బయల్దేరిన విమానం క్షణాల్లోనే మంటలకు ఆహుతైంది. రన్​వేపైనే ప్రమాదం జరగడం గమనార్హం.

Plane catches fire at Manila airport; all 8 aboard killed
విమానంలో మంటలు.. అంతా సజీవదహనం

By

Published : Mar 30, 2020, 8:33 AM IST

విమానంలో మంటలు చెలరేగగా.. 8 మంది సజీవదహనమైన ఘటన ఫిలిప్పీన్స్​లో సంభవించింది. మనీలా విమానాశ్రయం నుంచి జపాన్​కు వెళ్లాల్సిన విమానం.. రన్​వేపై ఉండగానే ప్రమాదం చోటుచేసుకుంది. బయల్దేరిన కాసేపటికే అగ్నికీలలు చెలరేగాయి. విమానంలోని ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు ధ్రువీకరించారు.

విమానంలో మంటలు.. అంతా సజీవదహనం

ఇందులో ఆరుగురి సిబ్బంది, ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఒక మెడికల్​ మిషన్​లో భాగంగా ఓ రోగిని టోక్యోకు తీసుకెళ్తుండగా రన్​వే చివరికి చేరుకోగానే ఘటన జరిగినట్లు తెలిపారు. అయితే.. సాంకేతిక సమస్యతోనే ప్రమాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details