విమానంలో మంటలు చెలరేగగా.. 8 మంది సజీవదహనమైన ఘటన ఫిలిప్పీన్స్లో సంభవించింది. మనీలా విమానాశ్రయం నుంచి జపాన్కు వెళ్లాల్సిన విమానం.. రన్వేపై ఉండగానే ప్రమాదం చోటుచేసుకుంది. బయల్దేరిన కాసేపటికే అగ్నికీలలు చెలరేగాయి. విమానంలోని ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు ధ్రువీకరించారు.
విమానంలో మంటలు.. అంతా సజీవదహనం - Manila airport general manager Ed Monreal
ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 8 మందితో బయల్దేరిన విమానం క్షణాల్లోనే మంటలకు ఆహుతైంది. రన్వేపైనే ప్రమాదం జరగడం గమనార్హం.
![విమానంలో మంటలు.. అంతా సజీవదహనం Plane catches fire at Manila airport; all 8 aboard killed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6590366-thumbnail-3x2-phil.jpg)
విమానంలో మంటలు.. అంతా సజీవదహనం
విమానంలో మంటలు.. అంతా సజీవదహనం
ఇందులో ఆరుగురి సిబ్బంది, ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఒక మెడికల్ మిషన్లో భాగంగా ఓ రోగిని టోక్యోకు తీసుకెళ్తుండగా రన్వే చివరికి చేరుకోగానే ఘటన జరిగినట్లు తెలిపారు. అయితే.. సాంకేతిక సమస్యతోనే ప్రమాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
TAGGED:
PHILIPPINES-CRASH