తెలంగాణ

telangana

ETV Bharat / international

శిథిలాల కింద నుంచి సురక్షితంగా బయటకు...

ఫిలిప్పీన్స్​లో భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవనంలో చిక్కుకున్న బాధితుడిని విపత్తు నిర్వహణ సిబ్బంది అనేక గంటల తర్వాత రక్షించారు.

By

Published : Apr 23, 2019, 11:24 AM IST

శిథిలాల కింద నుంచి సురక్షితంగా బయటకు...

శిథిలాల కింద నుంచి సురక్షితంగా బయటకు...

ఫిలిప్పీన్స్​ పరాక్​లో ఓ శిథిల భవనంలో చిక్కుకున్న బాధితుడిని విపత్తు నిర్వహణ సిబ్బంది సురక్షితంగా వెలికితీశారు. సోమవారం భూకంపం ధాటికి అతడు ఉన్న 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని, అప్పటి నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తికి... అనేక గంటల తర్వాత విముక్తి లభించింది.

ఫిలిప్పీన్స్​లో సంభవించిన భూకంపం ధాటికి రాజధాని మనీలా సహా పలు నగరాలు వణికిపోయాయి.6.1 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో పలు భవనాలు కూలిపోయాయి. ముగ్గురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: అరెస్టుకు ముందే దేశ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details