తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​లో ఇక కశ్మీర్​ రహదారులు, పార్కులు!

జమ్ము కశ్మీర్​ విషయంలో పాకిస్థాన్​ రోజుకో రీతిలో అక్కసు వెళ్లగక్కుతోంది. కశ్మీరీలకు సంఘీభావంగా పాక్​ పంజాబ్​లోని రహదారులు, పార్కులకు కశ్మీర్​ పేరు పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

By

Published : Aug 16, 2019, 7:30 PM IST

Updated : Sep 27, 2019, 5:24 AM IST

పాకిస్థాన్

కశ్మీర్​ విషయంలో భారత్​ నిర్ణయంపై పాకిస్థాన్​లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాక్​లోని పంజాబ్​ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మాన్​ బుజ్దార్​ కొత్త నాటకానికి తెరతీశారు. కశ్మీరీలకు మద్దతుగా కొన్ని ప్రాంతాలకు కశ్మీర్​ అని పేరు పెట్టాలని నిర్ణయించారు.

"రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలోని ఒక రహదారికి కశ్మీర్​ రోడ్​గా నామకరణం చేస్తాం. 5 ప్రధాన ఉద్యానవనాలను కశ్మీర్​ పార్కులుగా పిలుస్తాం. కశ్మీరీలకు మా సంఘీభావం ఈ విధంగా తెలియజేస్తాం."

-ఉస్మాన్​ బుజ్దార్​, పంజాబ్​ ముఖ్యమంత్రి

కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దును ఓ అంతర్జాతీయ సమస్యలా చూపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది పాక్. ఇందులో భాగంగానే భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని బ్లాక్​డే గా అభివర్ణించింది. పాక్​ స్వాతంత్ర్య దినమైన ఆగస్టు 14ను కశ్మీర్​ సంఘీభావ దినంగా ప్రకటించింది.

ఇదీ చూడండి: 'పరిస్థితులను బట్టే అణ్వస్త్రాల వినియోగంపై నిర్ణయాలు'

Last Updated : Sep 27, 2019, 5:24 AM IST

ABOUT THE AUTHOR

...view details