పాకిస్థాన్లోని లాహోర్లో నిషేధిత తెహ్రీక్-ఇ-లబైక్ పార్టీ(టీఎల్పీ) కార్యకర్తలు రెచ్చిపోయారు. నిషేధాన్ని ఎత్తివేయాలని నిరసిస్తూ లాహోర్లోని ఓ పోలీస్స్టేషన్పై దాడి చేసి, డీఎస్పీ సహా ఐదుగురు పోలీసులను కిడ్నాప్ చేశారు. అడ్డొచ్చిన పోలీసులను చితకబాదారు. పొగబాంబులతో దాడి చేశారు.
పాక్లో టీఎల్పీ కార్యకర్తల బీభత్సం.. డీఎస్పీ కిడ్నాప్ - టీఎల్పీ కార్యకర్తల బీభత్సం.. డీఎస్పీ కిడ్నాప్!
పాకిస్థాన్ లాహోర్లోని ఓ పోలీస్ స్టేషన్పై నిషేధిత తెహ్రీక్-ఇ-లబైక్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. డీఎస్పీ సహా ఐదుగురు పోలీసులను కిడ్నాప్ చేశారు. అడ్డొచ్చిన పోలీసులనూ చితకబాదారు.
టీఎల్పీ కార్యకర్తల బీభత్సం
ఈ క్రమంలో 50 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న పెట్రోల్ ట్యాంకర్ను అపహరించినట్లు పాక్లోని పంజాబ్ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ముగ్గురు టీఎల్పీ కార్యకర్తలు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో 11 మంది పోలీసులు కూడా గాయపడినట్లు తెలిపారు. డీఎస్పీ సహా మరో ఐదుగురు పోలీసులను ఓ మసీదులో ఉంచినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:పబ్లో పేలిన తుపాకీ.. ముగ్గురు మృతి