తెలంగాణ

telangana

ETV Bharat / international

దిల్లీ-లాహోర్ బస్సుకు బ్రేక్​ వేసిన పాక్​

దిల్లీ-లాహోర్​ బస్సు సర్వీసును నిలివేసింది పాకిస్థాన్​. జమ్ము కశ్మీర్​ విభజన, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది పొరుగు దేశం.

By

Published : Aug 10, 2019, 4:43 PM IST

దిల్లీ-లాహోర్ బస్సుకు బ్రేక్​ వేసిన పాక్​

జమ్ముకశ్మీర్​కు​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో భారత్​తో ద్వైపాక్షిక బంధాన్ని తెంచే దిశలో చర్యలు ముమ్మరం చేసింది పాకిస్థాన్​. ఇప్పటికే రెండు సరిహద్దు రైళ్లను నిలిపివేసిన పాక్​... తాజాగా దిల్లీ-లాహోర్​ ఫ్రెండ్​షిప్ బస్సు సర్వీసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ బస్సు సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది.

"జాతీయ భద్రతాకమిటీ (ఎన్​ఎస్​సీ) నిర్ణయం ప్రకారం భారత్​-పాక్​ మధ్య నడిచే బస్సు సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేస్తున్నాం."
- మురద్​ సయీద్​, పాక్​ కమ్యునికేషన్స్, పోస్టల్ సర్వీసెస్​ మంత్రి ట్వీట్​

1999 ఫిబ్రవరిలో దిల్లీ-లాహోర్​ మధ్య ఫ్రెండ్​షిప్​ బస్సు సర్వీసు ప్రారంభమైంది. 2001 పార్లమెంట్​పై ఉగ్రవాదుల దాడి అనంతరం దానిని నిలిపివేశారు. 2003 జులైలో ఈ బస్సు సర్వీసు పునరుద్ధరించారు.

ఇలా సర్వీసులు నడుస్తాయ్..

ఇండియా గేట్​ సమీపంలోని అంబేడ్కర్ స్టేడియం టెర్మినల్ నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో దిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) బస్సులు లాహోర్​ వెళ్తాయి. తిరిగి లాహోర్​ నుంచి దిల్లీకి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయలుదేరతాయి.

పాకిస్థాన్ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్​ కూడా బస్సు సర్వీసు నడుపుతోంది. ఈ బస్సులు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో దిల్లీ నుంచి లాహోర్​కు పయనమవుతాయి. తిరిగి దిల్లీకి సోమ, బుధ, శుక్రవారాల్లో బయలుదేరతాయి.

ఇదీ చూడండి:హువావేతో అమెరికా వ్యాపారం పూర్తిగా బంద్​

ABOUT THE AUTHOR

...view details