తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2020, 10:29 AM IST

ETV Bharat / international

'మాజీ ప్రధానిని రప్పించేందుకు బ్రిటన్​తో ఒప్పందం!'

మాజీ ప్రధాని నవాబ్​ షరీఫ్​ను తమకు అప్పగించేలా బ్రిటన్​తో ఒప్పందం చేసుకుంటామని పాకిస్థాన్​ సమాచార శాఖ మంత్రి తెలిపారు. నేరస్థులను అప్పగించుకునే సంధి ఆ దేశంతో ఇప్పటి వరకు లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి న్యాయ ప్రక్రియ మొదలైందని వెల్లడించారు.

pakistan-starts-legal-process-for-ex-pm-sharifs-extradition
'బ్రిటన్​తో నేరస్థుల అప్పగింత ఒప్పందం చేసుకుంటాం'

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాబ్​ షరీఫ్​ను.. బ్రిటన్​ ప్రభుత్వం తమకు అప్పగించేందుకు కావాల్సిన న్యాయ ప్రక్రియను ప్రారంభించినట్లు ఆ దేశ సమాచార మంత్రి షిబ్లి ఫరాజ్​ తెలిపారు. త్వరలోనే లండన్​తో తగిన ఒప్పందం చేసుకుంటామని పేర్కొన్నారు. కోర్టుకు ఇచ్చిన మాట మేరకు ఆయన దేశానికి తిరిగి రాలేదు. దీంతో నవాబ్​పై ఈ చర్యలకు సిద్ధమైనట్లు స్పష్టం చేశారు.

''దోషులను తమ దేశంలోకి రానివ్వకుండా బ్రిటన్​ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. షరీఫ్​పై 2018లోనే అవినీతి, మనీ లాండరింగ్​ కింద కేసు నమోదైంది. అయినా ఆయనను అనుమతించింది. షరీఫ్​ను వెనక్కి తీసుకురావడానికి కొంత కాలం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇకపైనా ప్రయత్నాలు చేస్తాం. ప్రస్తుతానికైతే లండన్​తో నేరస్థులను అప్పగించే ఒప్పందాలేవీ లేవు. దీనిపై యూకే నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. పార్లమెంట్​లోనూ కొంత ఇబ్బంది తప్పదు.''

-షిబ్లి ఫరాజ్, పాకిస్థాన్​ సమాచార శాఖ మంత్రి

అవినీతి, మనీ లాండరింగ్​ కేసులో షరీఫ్​ ఇప్పటికే ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించారు. మరో కేసులోనూ ఆయన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఇస్లామాబాద్​ హైకోర్టులో వాదనలు జరగాల్సి ఉంది. నవాబ్ ప్రస్తుతం లండన్​లో ఉండటంతో దానిపైనా అనిశ్చితి నెలకొంది.

ఇదీ చూడండి:చికిత్స నిమిత్తం లండన్​కు నవాజ్​ షరీఫ్​!

ABOUT THE AUTHOR

...view details