తెలంగాణ

telangana

By

Published : Nov 15, 2020, 5:46 AM IST

ETV Bharat / international

'మా దేశంలో ఉగ్రదాడులకు భారతే కారణం!'

పాకిస్థాన్​లో ఉగ్రదాడులకు భారత్​ కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అక్కడి విదేశాంగ మంత్రి షా మహమ్మద్​ ఖురేషీ. అయితే షా వ్యాఖ్యలను భారత్ ఖండించింది. పాకిస్థాన్​ అంతర్గత కలహాలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.

Pakistan says it has evidence of India sponsoring attacks
"మా దేశంలో ఉగ్రదాడులకు భారత్​ కారణం-ఆధారాలు ఉన్నాయి"

పాకిస్థాన్​లో దాడులకు భారత్​ సహకరిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్​ ఖురేషీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను బయటపెట్టారు. పాకిస్థాన్ ఆర్మీ అధికారి జనరల్​ బాబర్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాక్​ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటంపై భారత్​ శనివారం నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు.

"దేశంలో జరుగుతున్న ఉగ్ర దాడులకు భారత్​ కారణం. భారత నిఘా వర్గాలకూ, ఇతర ఉగ్రవాద సంస్థలకు ఉన్న విభేదాలకు సంబంధించిన పత్రాలను ప్రపంచం ముందు ఉంచుతున్నాం. చైనా-పాక్​ ఎకనామిక్​ కారిడార్​ను సైతం భారత్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది."

- షా మహమ్మద్​ ఖురేషీ, పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి.

అయితే షా వ్యాఖ్యలను భారత్​ ఖండించింది. పాకిస్థాన్​ అంతర్గత కలహాలకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. పాక్​ ఆక్రమిత ప్రాంతాల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం ద్వైపాక్షిక పద్ధతికి విరుద్ధం అని గుర్తు చేసింది.

నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటంపై భారత్​ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం పాక్​ హై కమిషనర్​ను పిలిచి నిరసన తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details