తెలంగాణ

telangana

By

Published : Mar 5, 2021, 5:14 AM IST

ETV Bharat / international

'భారత్​తో చర్చలకు పాక్ ఎప్పుడూ సిద్ధం'

భారత్​తో శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి పాక్​ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి తెలిపారు. కశ్మీర్​ సహా అన్నీ వివాదాలనకు చెక్​ పెట్టేందుకు సామరస్యంగా కూర్చుని మాట్లాడుకోవాలని పిలుపునిచ్చారు.

Pakistan never shied away from talks with India: Foreign Office
'భారత్​తో సమస్యల పరిష్కారానికి మేం ఎప్పుడు సిద్ధం'

భారత్​-పాకిస్థాన్​ల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి తమ దేశం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందని పాక్​ విదేశాంగ ప్రతినిధి జాహిద్​ హఫీజ్​ చౌదరి తెలిపారు. కశ్మీర్​ సహా మిగతా అన్నీ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు జరపడానికి తాము ఎప్పుడూ దూరంగా ఉండబోమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సైనిక ఉన్నతాధికారుల సమావేశంపై మాట్లాడారు. ఈ క్రమంలో భారత్​తో చర్చలపై ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా ఇందుకు బదులుగా సమాధానం ఇచ్చారు.

"ఇరుదేశాల మధ్యన ఉండే సమస్యల పరిష్కారానికి మేం ఎప్పుడూ సిద్ధమే. అందులో మొహమాటాలు ఏమీ లేవు. కశ్మీర్ సహా మిగతా వాటిపై కూడా చర్చలు జరపాలి. అత్యుత్తమ శాంతియుత పరిష్కారం కనుక్కోవాలి."

-జాహిద్​ హఫీజ్​ చౌదరి, పాకిస్థాన్​ విదేశాంగ శాఖ

స్నేహపూర్వక సంబంధాలే కావాలి..

పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నట్లు భారత్​ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఇందుకు దాయాది దేశం కూడా కట్టుబడి ఉండాలని పేర్కొంది.

"ప్రపంచ దేశాల్లో భారత్ స్థానం ఏంటి అనేది అందరికీ తెలుసు. తీవ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణాన్ని పాకిస్థాన్​ నుంచి భారత్​ కోరుకుంటుంది. అటువంటి పరిస్థితులు కావాలి అంటే వాటిని సృష్టించాల్సిన బాధ్యత పాక్​ పై కూడా ఉంది."

-అనురాగ్​ శ్రీవాస్తవ. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి

నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని తు.చ. తప్పకుండా పాటించాలని ఇరుదేశాలు ఈ నెల 25న నిర్ణయించాయి.

ఇదీ చూడండి: భారత్​-నేపాల్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం!

ABOUT THE AUTHOR

...view details