తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాకు ఆ ద్వీపాలు అమ్మేస్తున్న పాక్! - పాకిస్థాన్​ విపక్ష నేతలు

పాకిస్థాన్​ ప్రభుత్వం జారీ చేసిన ఓ ఆర్డినెన్స్​పై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. దేశానికి చెందిన రెండు ద్వీపాలను చైనాకు అమ్మేయడం కోసమే ఈ ఆర్డినెన్స్​ను తీసుకొచ్చినట్టు పాక్​లోని విపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని తేల్చిచెబుతున్నారు. ఇంతకి ఏంటి ఆ ఆర్డినెన్స్​? దానితో చైనాకు ప్రయోజనం ఉందా?

Pakistan aims to 'sell islands' to ChinaPakistan aims to 'sell islands' to China
చైనాకు ఆ ద్వీపాలను అమ్మేస్తున్న పాకిస్థాన్​!

By

Published : Oct 15, 2020, 3:56 PM IST

పాకిస్థాన్​-చైనా... ఈ రెండు ఆసియ దేశాల మధ్య ఉన్న మైత్రి ప్రపంచ దేశాలకు తెలిసిన విషయమే. ప్రపంచ దేశాలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా.. చైనా అండతో పాకిస్థాన్​ బయటపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు కృతజ్ఞతగా చైనాకు పాకిస్థాన్​ కూడా తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. ఇందులో మొదటిగా చెప్పుకునేది సీపెక్​(చైనా-పాకిస్థాన్​ ఎకనామిక్​ కారిడర్​). సొంత దేశంలోనే ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకత ఎదురవుతున్నా.. పాక్​ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. తన వద్ద ఉన్న ద్వీపాలను కూడా చైనాకు అప్పజెప్పాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్​ ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది.

ఏంటి ఈ ఆర్డినెన్స్​?

కరాచీకి దక్షిణాన.. బుందల్​, భుద్దో అనే రెండు ద్వీపాలు ఉన్నాయి. ఇవి కొంత కాలం ముందు వరకు సింధ్​ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఉండేవి. వీటిని అభివృద్ధి చేసే విషయంపై ప్రణాళికలు రూపొందించేందుకు సంబంధించిన పీఐడీఏ(పాకిస్థాన్​ ఐల్యాండ్​ డెవెలప్​మెంట్​ అథారిటీ) ఆర్డినెన్స్​పై గత నెలలో సంతకం చేశారు ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్​ అల్వి.

ఇదీ చూడండి:-గిల్గిత్​ బాల్టిస్థాన్​లో పాక్​ సర్కారుకు నిరసన సెగ

ఈ ఆర్డినెన్స్​పై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. సీపెక్​లో భాగంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ద్వీపాలను చైనాకు అమ్మేయడానికే పాక్​ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.

సింధ్​, బలూచిస్థాన్​లో నేతలు ఈ ఆర్డినెన్స్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ ఛైర్మన్​ బిలావల్​ భుటటో జర్దారీతో పాటు అనేక మంది రాజకీయ నేతలు ప్రభుత్వ చర్యలను అక్రమమని అభివర్ణిస్తున్నారు. తమ భూములను చైనా కమ్యూనిస్ట్​ పార్టీకి అమ్మితే సహించబోమని తేల్చి చెబుతున్నారు.

సేవ్​ ఐల్యాండ్స్​...

పాకిస్థాన్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 'సేవ్​ సీ ఐల్యాండ్స్​' ఉద్యమాన్ని ప్రారంభించింది పాకిస్థాన్​ ఫిషర్​ఫోక్​ ఫోరమ్​(పీఎఫ్​ఎఫ్​). దేశంలోనే అతిపెద్ద మత్య్సకారుల యూనియన్​గా పేరొందిన ఈ పీఎఫ్​ఎఫ్​.. ద్వీపాల అమ్మకంపై తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపేందుకు సన్నద్ధమవుతోంది.

ఇదీ చూడండి-చైనా-పాకిస్థాన్ మరో కుట్ర- పీఓకేలో క్షిపణి స్థావరాలు

ఈ ఆర్డినెన్స్​ వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు నేషనల్​ పార్టీ సెనెటర్​ కబీర్​ మహ్మద్​ షాహీ.

"సింధ్​, బలూచిస్థాన్​లోని తీర ప్రాంతాన్ని కేంద్ర తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఆర్డినెన్స్​ తెచ్చింది. దీని వెనుక పెద్ద పథకమే ఉన్నట్టు కనిపిస్తోంది. గ్వదర్​ పోర్టు సహా సీపెక్​కు సంబంధించిన ఇతర కీలక ప్రదేశాలు తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా పోతుంది."

-- కబీర్​ మహ్మద్​, నేషనల్​ పార్టీ.

'అక్కడ అభివృద్ధే కష్టం..'

ఆర్డినెన్స్​ తీసుకొచ్చిన ప్రాంతాలను అసలు అభివృద్ధి చేయడం కష్టమని పర్యావరణవేత్త జహంగిర్​ దుర్రాని అభిప్రాయపడ్డారు. విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం ఇందుకు ముఖ్య కారణమన్నారు.

ఇంత ఆకస్మికంగా ఈ ద్వీపాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడంపై వాషింగ్టన్​లోని సౌత్​ ఏషియా సెంటర్​ ఫర్​ స్ట్రాటిజిక్​ స్టడీస్ సభ్యుడు మోహన్​ మాలిక్​ అనుమానం వ్యక్తం చేశారు. సీపెక్​లోని ఇతర ప్రాజెక్టుల కూడా నమ్మశక్యంగా లేవని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం సమయంలో ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్యంలో ఇవి సాధ్యపడతాయా? అని ప్రశ్నించారు.​

ఇదీ చూడండి:-'భారత సైన్యంలో విభేదాల సృష్టికి పాక్ కుట్ర'

ABOUT THE AUTHOR

...view details