వరుసగా రెండోరోజు సరిహద్దు వెంట పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అప్రమత్తమైన భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చింది.
బుధవారం రాత్రి 10 గంటల 15 నిమిషాల సమయంలో.. రాజౌరీ జిల్లా సుందర్బనీ ప్రాంతం వద్ద పాకిస్థాన్ దాడికి తెగబడినట్లు అధికారులు తెలిపారు. చిన్న చిన్న ఆయుధాలు, మోర్టార్లతో కాల్పులు ప్రారంభించింది దాయాది దేశం. అప్రమత్తమైన భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. పాక్ సైన్యానికి దీటైన బదులిచ్చాయి.