పాకిస్థాన్లో ఇటీవల ఓ హిందూ ఆలయంపై జరిగిన దాడులకు సంబంధించి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆ దేశ సుప్రీంకోర్టు. ఆ ఘటన.. పాకిస్థాన్ ప్రతిష్ఠను దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేయాలని ఆదేశించింది.
దాడి జరుగుతున్న సమయంలో అక్కడున్న హిందూ కుటుంబాల రక్షణకే ప్రాధాన్యం ఇచ్చామని అధికారులు ఇచ్చిన సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దాడిని కట్టడి చేయలేని అధికారులను తొలగించాలని సూచించింది.
ఇదీ జరిగింది..