తెలంగాణ

telangana

ETV Bharat / international

గురుద్వారాపై భారత్​వి నిరాధార ఆరోపణలు: పాక్​ - Pak summons Indian Charge d'Affaires Gaurav Ahluwalia

నన్​కానా సాహిబ్​ గురుద్వారాపై జరిగిన దాడి విషయంలో పాక్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత్​ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో దాయాది దేశం స్పందించింది. ఈ ఘటనపై భారత్​ నిరాధార ఆరోపణలు చేస్తోందని ప్రకటించింది.

Pak summons Indian Charge d'Affaires Gaurav Ahluwalia
గురుద్వారాపై భారత్​వి నిరాధారమైన ఆరోపణలు

By

Published : Jan 7, 2020, 11:49 PM IST

పాకిస్థాన్​లోని గురుద్వారా నన్​కానా సాహిబ్​పై జరిగిన దాడిని ఖండిస్తూ.. పాక్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత్​ జారీ చేసిన సమన్లను తోసిపుచ్చింది పాక్. గురుద్వారా ఘటనపై భారత్​ నిరాధార ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చింది.

కశ్మీర్ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే భారత్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని.. పాక్​ రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతిపౌరుడికి సమాన హక్కులు ఉన్నాయని తెలిపింది పొరుగుదేశం. ఎటువంటి వివక్ష చూపకుండా మైనారిటీల భద్రత విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చింది.

ఇదీ చూడండి:పాక్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత్​ సమన్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details