పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్కు విచిత్ర ఘటన ఎదురయింది. ఇస్లామాబాద్లో నిర్వహిస్తున్న కశ్మీర్ అవర్ సభలో మాట్లాడుతున్న సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యారు అహ్మద్.
కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశాలేమిటో మాకు తెలుసంటూ వ్యాఖ్యానిస్తుండగా ఆయన విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. షాక్ కొట్టిన క్షణంలో ఆయన ఒక్కసారిగా వేదికపై తుళ్లిపడ్డారు. అనంతరం ఈ సమావేశాన్ని మోదీ విఫలం చేయలేరంటూ రషీద్ వ్యాఖ్యానించారు.