తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ మాజీ ప్రధానిపై దేశ ద్రోహం కేసు

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఆయన​ ఇటీవల వీడియో ద్వారా చేసిన రెండు ప్రసంగాలపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు లాహోర్​ పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

By

Published : Oct 6, 2020, 4:53 AM IST

Pak police registers sedition case against Sharif, other PML-N leaders
పాక్​ మాజీ ప్రధానిపై దేశ ద్రోహం కేసు

పాకిస్థాన్​ మాజీ ప్రధాని, పీఎంఎల్​-నవాజ్​ పార్టీ అధినేత నవాజ్​ షరీఫ్​, ఆయన కుమార్తె మరియం సహా మరికొంతమంది నేతలపై దేశ ద్రోహం కేసు నమోదైంది. దీంతోపాటు సైబర్​ ఉగ్రవాదం, నేరపూరిత కుట్ర, దేశంపై యుద్ధం ప్రకటించటం తదితర కఠినమైన అభియోగాలను మోపారు.

లండన్​లో ఉన్న షరీఫ్​ ఇటీవల వీడియో ద్వారా చేసిన రెండు ప్రసంగాలపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు లాహోర్​ పోలీసులు సోమవారం ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. పాక్​ సైన్యం, న్యాయ వ్యవస్థలపై ప్రజల తిరుగుబాటును ప్రోత్సహించేలా ఆ ప్రసంగాలు ఉన్నాయని అభియోగాల్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details