తెలంగాణ

telangana

ETV Bharat / international

లాడెన్​​ అమరవీరుడంటూ కీర్తించిన ప్రధాని

By

Published : Jun 25, 2020, 7:05 PM IST

Updated : Jun 25, 2020, 8:38 PM IST

pak pm
ప్రధాని

19:02 June 25

లాడెన్​​ అమరవీరుడంటూ కీర్తించిన ప్రధాని

పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఒకానొక సందర్భంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ బహిరంగంగానే అంగీకరించారు. గత ప్రభుత్వాలు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చాయని వెల్లడించారు. అయితే ఓవైపు ఆశ్రయం ఇచ్చామని చెబుతూనే ఉగ్రవాదం కారణంగా పాకిస్థాన్​ బలైందని పొంతన లేకుండా వాదించారు.  

ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ఇమ్రాన్​. ఈ సారి మరో మెట్టు పైకెక్కి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్​ లాడెన్​ను 'అమరవీరుడు' అని కీర్తించారు. అదీ పాకిస్థాన్ పార్లమెంటు సాక్షిగా..  ఆపై పాక్​ ఉగ్రవాద బాధిత దేశమని మరోసారి అసంబద్ధంగా వాదించారు. పాక్​ జాతీయ అసెంబ్లీలో గురువారం ఓ అంశంపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్.  

"ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు మద్దతుగా నిలిచాం. ఆ విషయంలో మనకు నష్టమే జరిగింది. అఫ్గానిస్థాన్​ సంబంధించిన విషయంలోనూ పాక్ పైనే నిందలు వేశారు. ఉదాహరణకు ఓ ఘటన చెబుతా. ఈ విషయంలో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.  

అబోటబాద్​లో ఒసామా బిన్​ లాడెన్​ను అమెరికా సేనలు చంపేశాయి. లాడెన్​ అమరుడయ్యాడు. తర్వాత ఏమైంది? ప్రపంచమంతా పాకిస్థాన్​నే తప్పుబట్టాయి. ఉగ్రవాదంపై పోరులో 10 ఏళ్లుగా నిందలు ఎదుర్కొంటూ వస్తున్నాం. అమెరికా మన దేశంలోకి వచ్చి ఒకర్ని చంపేవరకూ ఆ విషయం మనకు తెలియదు."

- ఇమ్రాన్ ఖాన్​, ప్రధానమంత్రి

Last Updated : Jun 25, 2020, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details