భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించేందుకు.. పాకిస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. జాదవ్ మరణశిక్షపై సమర్ధమైన పద్ధతిలో తప్పకుండా పునఃసమీక్ష చేయాలని అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐసీజే).. 2019జులైలో ఇచ్చిన తీర్పు ఆధారంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
కుల్భూషణ్ మరణశిక్షపై పాక్ కీలక నిర్ణయం - కుల్భూషణ్ జాదవ్ మరణశిక్ష పునఃసమీక్ష
కుల్భూషణ్ జాదవ్ మరణశిక్షను పున:సమీక్షించేందుకు ప్రవేశపెట్టనున్న బిల్లుకు పాకిస్థాన్ పార్లమెంటరీ కమిటీ ఆమోద ముద్ర వేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం అదేశాలకు అనుగుణంగా ఈ బిల్లును రూపొందించినట్టు పాక్ న్యాయశాఖ మంత్రి పేర్కొన్నారు.
కుల్భూషణ్ మరణశిక్షపై పాక్ కీలక నిర్ణయం
అంతర్జాతీయ న్యాయస్ధానం-సమీక్ష, పునరాలోచన పేరుతో పాకిస్థాన్ ప్రభుత్వం రూపొందించిన ఈ ముసాయిదా బిల్లుపై న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చర్చించి.. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఆమోదం తెలిపింది. చర్చలో పాల్గొన్న పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి ఫరోగ్ నసీమ్.. అంతర్జాతీయ న్యాయస్ధానం ఆదేశాలకు అనుగుణంగా ఈ బిల్లును రూపొందిచినట్లు తెలిపారు. పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించకుంటే పాకిస్థాన్ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి:-'కుల్భూషణ్ యాదవ్ కేసులో అది సాధ్యం కాదు'