తెలంగాణ

telangana

ETV Bharat / international

'పాతాళంలో భారత్​-పాక్​ బంధం.. మోదీపైనే భారం'

భారత్​ - పాకిస్థాన్​ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ సమ్మతిస్తేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

By

Published : Jun 14, 2019, 10:52 AM IST

ఇమ్రాన్​ ఖాన్​

భారత్​తో సంబంధాలు అట్టడుగుకు చేరుకున్నాయని పాకిస్థాన్​ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్​ అభిప్రాయపడ్డారు. కశ్మీర్ సమస్యతో పాటు ఈ విభేదాలను తొలగించేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ తన అత్యున్నత అధికారాన్ని ఉపయోగించాలని కోరారు.

కిర్గిజిస్థాన్​ రాజధాని బిష్కెక్​లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో ఇరు దేశాల నేతలు పాల్గొన్నారు. ఇదే వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి కోసం మోదీతో మాట్లాడే అవకాశం రావాలని కోరుకున్నారు ఇమ్రాన్​. ఇతర దేశాలతో మంచి సంబంధాలు నెరిపేలా ఎస్​సీఓ మంచి వేదికనిచ్చిందని పేర్కొన్నారు.

"పక్క దేశాలతో ముఖ్యంగా భారత్​తో శాంతి చర్చలకు ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని అయినా అంగీకరిస్తాం. మూడు చిన్న యుద్ధాలు ఇరు దేశాలకు ఎంతో నష్టాన్ని కలిగించి పేదరికాన్ని మిగిల్చాయి. భారత్​తో ఉన్న మరో ముఖ్యమైన విభేదం కశ్మీర్​. రెండు దేశాల ప్రభుత్వాలు, అధినేతలు తలుచుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. దురదృష్టవశాత్తు మాకు భారత్​ నుంచి ఎలాంటి సహకారం లేదు. మోదీ తన అధికారాన్ని వాడి ఉపఖండంలో శాంతిని నెలకొల్పుతారని భావిస్తున్నాం."

-ఇమ్రాన్​ ఖాన్​, పాకిస్థాన్ ప్రధానమంత్రి

చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​తో భేటీలో పాకిస్థాన్​పై మండిపడ్డారు మోదీ. ఉగ్రవాద రహిత వాతావరణం ఏర్పడేందుకు పాకిస్థాన్​ కృషి చేస్తేనే చర్చలను పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం నిర్మూలనకు పాకిస్థాన్​ నుంచి దృఢమైన చర్యలను కోరుకుంటుందని మోదీ తెలిపారు.

ఇదీ చూడండి: పాక్​తో శాంతినే కోరుకుంటున్నాం: మోదీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details