తెలంగాణ

telangana

ETV Bharat / international

అప్పుల బాధతో.. ఆస్తుల అమ్మకానికి సిద్ధమైన పాక్​! - దేశ, వీదేశీ పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు దుబాయ్​ ఎక్స్​పోలో వీటిని అమ్మకానికి ఉంచాలని నిర్ణయించింది.

ఆర్థికంగా కుదేలైపోయిన పాకిస్థాన్​.. సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా వినియోగంలో లేని విలువైన ప్రభుత్వ ఆస్తులను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దేశ, వీదేశీ పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు దుబాయ్​ ఎక్స్​పోలో వీటిని అమ్మకానికి ఉంచాలని నిర్ణయించింది.

pak properties
పాక్​ : ఆస్తుల అమ్మకానికి సిద్ధంగా ఉన్నాం

By

Published : Dec 5, 2019, 8:38 PM IST

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఆర్థిక కష్టాల నుంచి​ గట్టెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వినియోగంలో లేనివిలువైన ప్రభుత్వ ఆస్తులను విక్రయించడానికి నిర్ణయించుకుంది. దేశీయ, విదేశీ పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు దుబాయ్​ ఎక్స్​పో ప్రదర్శనను వేదికగా ఎంచుకుంది.

ప్రజా సంక్షేమం కోసం..

ఆస్తులను విక్రయించగా వచ్చిన ధనాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు వినియోగిస్తామని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ తెలిపారు. విద్యా, వైద్య, ఆహార, గృహనిర్మాణం లాంటి ప్రజాసంక్షేమ పథకాలకు వినియోగిస్తామని ఆయన వెల్లడించారు.

"దేశ,విదేశీ పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు దుబాయ్​ ఎక్స్​పో ప్రదర్శనను వేదికగా ప్రస్తుతం వినియోగంలో లేని ప్రభుత్వ ఆస్తులను విక్రయించాలని నిర్ణయించాం. దురదృష్టమేంటంటే గత ప్రభుత్వాలు ఈ విలువగల ఆస్తులను వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేశాయి. కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నప్పటికీ, వివిధ ప్రభుత్వ సంస్థలు ఏటా కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తున్నాయి."

- ఇమ్రాన్​ఖాన్​, పాక్ ప్రధాని

పాక్​ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాని మిత్ర దేశాలైన చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ ఆర్థిక సహాయం చేశాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పాక్​కు ఆరు బిలియన్​ డాలర్ల రుణాన్ని అందించింది.

ఇదీ చూడండి : వజ్రాలతో పొదిగిన క్రిస్మస్​ ట్రీ... ధర తెలిస్తే షాక్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details