తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ మాటలు అర్థరహితమైనవి:అఫ్గానిస్థాన్​

కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులను అఫ్గానిస్థాన్​లో శాంతి ప్రక్రియకు ముడిపెట్టి పాకిస్తాన్​ మాట్లాడటాన్ని అఫ్గానిస్థాన్​ మండిపడింది. అమెరికాలోని అఫ్గాన్​ రాయబారి రోయా రహ్మానీ ఈ సందర్భంగా ట్విట్టర్​లో ఓ లేఖను విడుదల చేశారు.

By

Published : Aug 19, 2019, 10:39 PM IST

Updated : Sep 27, 2019, 2:11 PM IST

పాక్​ మాటలు అర్థరహితమైనవి:అఫ్గానిస్థాన్​


కశ్మీర్​ అంశాన్ని అఫ్గానిస్థాన్​లో శాంతి ప్రక్రియకు పాకిస్థాన్​ ముడిపెట్టి మాట్లాడటంపై అఫ్గానిస్థాన్​ మండిపడింది. ఈ మేరకు అమెరికాలోని అఫ్గానిస్థాన్​ రాయబారి రోయా రహ్మాని ట్విట్టర్​ ద్వారా లేఖను విడుదల చేశారు.

అమెరికాలోని పాకిస్థాన్​ రాయబారి అసద్​ మజీద్​ ఖాన్​ ఆఫ్గాన్​పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు రహ్మానీ తెలిపారు. తమ దేశంపై పాక్​ అర్థరహితంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందని మండిపడ్డారు. కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులు అఫ్గాన్​లో తీవ్ర ప్రభావం చూపుతాయన్న మజీద్​ ఖాన్​ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

అఫ్గాన్​ నుంచి పాక్​కు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. సరిహద్దుల్లో పాకిస్థాన్​ వేలాది మంది సైనిక బలగాలు మొహరించడానికి సరైన కారణం కనబడటం లేదని ఆక్షేపించారు. పాక్​ ఉగ్రవాదుల నుంచి తమ దేశానికి తరచూ ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయని రహ్మానీ ఆరోపించారు.

పాక్​ ఒడిలో ఉగ్రవాదం

ఉగ్రవాదుల్ని పాకిస్థాన్ పెంచి పోషించి అఫ్గాన్​వైపు ఉసిగొల్పుతోందని రహ్మానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పాక్​ పాత్ర లేకపోతే బహిరంగంగా దీనిపై మాట్లాడాలని, ఉగ్రవాదంపై కఠిన చట్టాలను అమలు పరచాలని లేఖలో స్పష్టం చేశారు.

Last Updated : Sep 27, 2019, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details