తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత్​ సమన్లు - పాక్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత్​ సమన్లు

పాకిస్థాన్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. లాహోర్​లోని గురుద్వారా నన్​కానా సాహెబ్​పై జరిగిన దాడితో పాటు పెషావర్​లో సిక్కు వర్గానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు నిరసనగా ఆందోళనలు చేపట్టాలని డిమాండ్​ చేసింది.

Pak Charge d'affairs summoned over Nankana Sahib incident, killing of Sikh man
పాక్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత్​ సమన్లు

By

Published : Jan 6, 2020, 11:42 PM IST

పాకిస్థాన్​లోని గురుద్వారా నన్​కానా సాహెబ్​పై జరిగిన దాడిని ఖండిస్తూ.. పాక్​ డిప్యూటీ హైకమిషనర్​ 'సయీద్​ హైదర్​ షా'కు సమన్లు జారీ చేసింది భారత్​. అలాగే పెషావర్​లో సిక్కు వర్గానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు నిరసనగా హైదర్​ షా భారీ నిరసన ర్యాలీ నిర్వహించాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్​లోని మైనారిటీలకు భద్రత, సంక్షేమంతో పాటు వారి పవిత్ర స్థలాలకు రక్షణ కల్పించేలా ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపింది.

గత శుక్రవారమే దాడి

సిక్కుల మత గురువు గురునానక్‌ జన్మస్థలంగా భావించే లాహోర్​లోని గురుద్వారా నన్‌కానా సాహెబ్‌పై గత శుక్రవారం దాడి జరిగింది. కొందరు వ్యక్తులు గురుద్వారాను ధ్వంసం చేయాలని చూశారు. అనంతరం అక్కడి భక్తులపై దాడికి దిగారు. అలాగే పాకిస్థాన్​లోని పెషావర్​లో సిక్కు వర్గానికి చెందిన ఓ వ్యక్తిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సిక్కులే లక్ష్యంగా పాక్​లో జరుగుతోన్న విధ్వంసకాండను భారత్ తీవ్రంగా​ ఖండించింది.

ఇదీ చూడండి : దిల్లీ దంగల్: త్రిముఖ పోరులో నిలిచి గెలిచేదెవరో?

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details