తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​కు కశ్మీర్​ ప్రాణాధారం: జనరల్​ భజ్వా - పాకిస్థాన్​కు కశ్మీర్​ ప్రాణాధారం

కశ్మీర్​ తమ సొంత భూభాగమని అర్థం వచ్చేలా పాకిస్థాన్​ సైన్యాధ్యక్షుడు జనరల్​ ఖమర్​ జావెద్​ భజ్వా వ్యాఖ్యానించారు. పాక్​కు కశ్మీర్​ ప్రాణాధారమని, భారత్​ ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నిస్తే తిప్పికొడతామని తెలిపారు.

జనరల్​ ఖమర్​ జావెద్​ భజ్వా, పాక్​ సైన్యాధ్యక్షుడు

By

Published : Oct 4, 2019, 5:04 AM IST

భారత్​పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది పాకిస్థాన్. పాక్​కు కశ్మీర్​ మెడనరం వంటిదని వ్యాఖ్యానించారు ఆ దేశ సైన్యాధ్యక్షుడు జనరల్​ ఖమర్​ జావెద్​ భజ్వా. భారత్​ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చులకు పోయారు.

కార్ప్స్ కమాండర్స్​ సమావేశంలో పాల్గొన్న భజ్వా.. కశ్మీర్​ అంశంపై మాట్లాడారు.

"దేశ గౌరవం, ప్రతిష్ఠ, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వెయ్యబోం. ఈ విషయంలో భారత్​ ఎలాంటి దుస్సాహసానికి ప్రయత్నించినా తీవ్రంగా ప్రతిఘటిస్తాం. పాక్​కు కశ్మీర్​ మెడనరం వంటిది. ఇందులో ఎలాంటి రాజీ ఉండదు."

-జనరల్​ ఖమర్​ జావెద్​ భజ్వా, పాక్​ సైన్యాధ్యక్షుడు

ఇదీ చూడండి: 'కశ్మీర్​ ప్రగతి పయనం 'వందే భారత్'​తో ఆరంభం'

ABOUT THE AUTHOR

...view details