భారతదేశానికి చెందిన ఓ నిఘా క్వాడ్కాప్టర్ను కూల్చివేసినట్లు పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి గగనతల సరిహద్దులను ఉల్లంఘిస్తూ... పాక్ భూభాగంలోకి చొచ్చుకురావడం వల్లనే క్వాడ్కాప్టర్ను కూల్చివేసినట్లు తెలిపింది. ఈ ఘటన నియంత్రణ రేఖలోని హాట్ స్ప్రింగ్ సెక్టార్లో జరిగినట్లు పేర్కొంది.
"భారత్కు చెందిన నిఘా క్వాడ్కాప్టర్ నియంత్రణరేఖ దాటి 850 మీటర్ల మేర పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకువచ్చింది. అందుకే దానిని కూల్చేశాం. ఈ సంవత్సరం పాక్ సైనిక దళాలు కూల్చిన తొమ్మిదో భారత నిఘా డ్రోన్ ఇది."
- పాక్ సైన్యం
తోసిపుచ్చిన భారత్
పాకిస్థాన్ సైన్యం గతంలో కూడా ఇలాంటి వాదనలే (క్వాడ్కాప్టర్లు కూల్చడం) చేసింది. అయితే భారత్ వాటిని తోసిపుచ్చింది.