తెలంగాణ

telangana

By

Published : May 8, 2020, 5:16 PM IST

ETV Bharat / international

తాలిబన్ మాజీ అధ్యక్షుడి ఆస్తులు జప్తు

తాలిబన్ మాజీ అధ్యక్షుడు ముల్లా మన్సూర్​కు చెందిన ఆస్తులను జప్తు చేసింది పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు. రూ. 3.2 కోట్ల విలువైన ఆ ఆస్తులను వేలం వేయనున్నట్లు తెలిపింది. 2016లో అమెరికా దళాలు చేపట్టిన ఆపరేషన్​లో మన్సూర్ హతమయ్యాడు.

taliban leader
తాలిబన్ మాజీ అధ్యక్షుడి ఆస్తులు జప్తు చేసిన పాక్ కోర్టు

అఫ్గానిస్థాన్​లో అశాంతికి కారకుల్లో ఒకరైన తాలిబన్ సంస్థ మాజీ అధ్యక్షుడు ముల్లా అఖ్తర్ మన్సూర్ ఆస్తులను జప్తు చేసింది పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు. రూ. 3.2 కోట్ల విలువైన ఆయన ఆస్తులను వేలం వేసేందుకు నిర్ణయించింది.

మన్సూర్ నేపథ్యం..

నాటి తాలిబన్ల అధ్యక్షుడు, ఒసామా బిన్​ లాడెన్ సహచరుడు ముల్లా ఒమర్ 2013లో హతమయ్యాడు. తర్వాత తాలిబన్ల చీఫ్​గా ఎంపికైన మన్సూర్.. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన సైనిక ఆపరేషన్​లో మరణించాడు. అతడు తాలిబన్ల కమాండర్​గా ఉన్న సమయంలో తప్పుడు ధ్రువీకరణలతో కరాచీలో ఆస్తులను కొనుగోలు చేశాడని సమాచారం.

వేలం ద్వారా..

తాలిబన్లకు నిధులు అందే అంశమై విచారణ చేపట్టిన పాక్ దర్యాప్తు సంస్థ ఎఫ్​ఐఏకు మన్సూర్ ఆస్తుల విషయం తెలిసింది. గతేడాది నుంచి విచారణ చేపట్టిన ఎఫ్​ఐఏ అధికారులు.. ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు నివేదించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆస్తులను వేలం వేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇటీవల మన్సూర్ ఆస్తులను జప్తు చేశారు.

ఇదీ చూడండి:'లక్షల మంది వలస కార్మికులకు కరోనా ముప్పు'

ABOUT THE AUTHOR

...view details