శుక్రవారం దాదాపు 600 మంది భారతీయ సిక్కులు వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ చేరుకున్నారు. సిక్కు మత గురువు గురునానక్ 551వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారతీయులు పాక్కు ప్రయాణమయ్యారు.
నవంబర్ 30న పాకిస్థాన్ పంజాబ్ ప్రాంతంలోని గురుద్వారా జన్మస్థానమైన నన్కానా సాహిబ్ వద్ద ఈ జయంతి వేడుకలు జరగనున్నాయి.
" మొత్తంగా 602 మంది భారతీయ సిక్కులు పాకిస్థాన్ చేరుకున్నారు. 10 రోజుల పాటు వారు నంకానా సాహిబ్ ప్రాంతంలోని ఇతర గురుద్వారాలను కూడా సందర్శించనున్నారు. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) ఛైర్మన్ డా. అమీర్ అమ్మద్ సూచనల మేరకు యాత్రికుల కోసం ప్రత్యేక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు".