హాంగ్కాంగ్కు చెందిన త్సాంగ్ యిన్ హంగ్ అనే 45 ఏళ్ల ఉపాధ్యాయురాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ను వేగంగా ఎక్కిన మహిళగా చరిత్ర సృష్టించారు. దాదాపు 8 వేల 849 మీటర్ల ఎత్తైన ఈ పర్వతాన్ని ఆమె కేవలం 25 గంటల 50 నిమిషాల్లోనే అధిరోహించారు.
25 గంటల 50 నిమిషాల్లోనే ఎవరెస్ట్ ఎక్కిన మహిళ - ఎవరెస్ట్ను ఎక్కిన ఉపాధ్యాయురాలు
త్సాంగ్ యిన్ హంగ్ అనే 45 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఎవరెస్ట్ను వేగంగా ఎక్కిన మహిళగా చరిత్ర సృష్టించారు. త్సాంగ్ యిన్ హాంకాంగ్కు చెందిన మహిళ.
![25 గంటల 50 నిమిషాల్లోనే ఎవరెస్ట్ ఎక్కిన మహిళ Everest, everest climbing records](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11960519-thumbnail-3x2-evarest.jpg)
ఎవరెస్ట్, త్సాంగ్ యిన్ హంగ్
ఎవరెస్ట్
అంతకుముందు నేపాల్కు చెందిన పున్జో ఝంగ్ము లానా పేరిట ఈ రికార్డు ఉండేది. ఆమె 39 గంటల 6 నిమిషాల్లో పర్వతాన్ని ఎక్కారు. అటు చికాగోకు చెందిన 75 ఏళ్ల ఆర్థర్ మ్యూర్ అమెరికా నుంచి పర్వతాన్ని అధిరోహించిన పెద్ద వయస్కుడిగా నిలిచారు. ఫలితంగా 67 ఏళ్ల బిల్ బర్క్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు.
ఇదీ చూడండి:12 ఏళ్ల తర్వాత గద్దె దిగనున్న నెతన్యాహూ!