తెలంగాణ

telangana

ETV Bharat / international

'నరమేధం' మృతుల సంఖ్య-50 - ఉగ్ర నరమేధం

న్యూజిలాండ్​ మసీదుల్లో జరిగిన ఉగ్ర నరమేధంలో మృతుల సంఖ్య 50కి చేరింది. ఘటన జరిగిన రోజే 49 మంది మృతి చెందారు.

ఉగ్ర నరమేధం

By

Published : Mar 17, 2019, 9:54 AM IST

ఉగ్ర నరమేధం
న్యూజిలాండ్​ మసీదుల్లో శుక్రవారం జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 50కి చేరింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 36 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే దాడి జరిగిన రెండు భవనాల నుంచి మృతదేహాలను తరలించామని క్రైస్ట్​చర్చ్ పోలీస్ కమిషనర్ మైక్ బుష్ తెలిపారు.

ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వాహనంలోనే దాడికి పాల్పడిన తీవ్రవాది బ్రెంటన్ టారంట్ ప్రయాణించాడని అనుమానాలున్నాయి. దాడితో వీరికి ప్రత్యక్ష సంబంధం లేదని, ఇప్పటి వరకు టారంట్​పైనే కేసు నమోదు చేశామని బుష్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details