సరిహద్దు వివాదంలో భారత్తో నేపాల్ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోంది. భారత్తో చర్చలకోసం ఎదురుచూస్తున్నామని చెబుతోన్న నేపాల్.. మరోవైపు కొత్తగా రూపొందించిన వివాదాస్పద జాతీయ పటాన్ని ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
మూడు దేశాల సరిహద్దులు కలిసే లిపులేఖ్లో భారత్ రహదారి ప్రారంభించడాన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో లిపులేఖ్తోపాటు కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపిస్తూ రూపొందించిన జాతీయ పటానికి నేపాల్ కేబినెట్ ఆమోదం తెలిపింది.
అఖిల పక్ష భేటీతో..
ఈ పటాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు ఈ రోజు నేపాల్ పార్లమెంటులో చర్చ కోసం బిల్లును ప్రవేశపెట్టారు నేపాల్ న్యాయశాఖ మంత్రి శివమయ్య. గత నెలలోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అఖిల పక్షంతో చర్చించిన తర్వాత దీనిపై ముందుకెళ్లాలని ప్రధాని కేపీ శర్మ ఓలీ బిల్లును ఉపసంహరించుకున్నారు.