తెలంగాణ

telangana

'నూతన మ్యాప్'​తో నేపాల్​ కొత్త పాఠ్య పుస్తకాలు

By

Published : Sep 18, 2020, 4:39 PM IST

భారత్​తో కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్​.. ఇటీవల విడుదల చేసిన కొత్త మ్యాప్​ను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నూతన మ్యాప్​ చిత్రపటాలను పంపిణీ చేయగా.. తాజాగా మరో ముందడుగు వేసింది. పాఠ్య పుస్తకాల్లో చేర్చింది.

Nepal introduces new text books with revised map
'నూతన మ్యాప్'​తో నేపాల్​ కొత్త పాఠ్య పుస్తకాలు

భారత్​తో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ మరో అడుగు ముందుకేసింది నేపాల్​. భారత్​లోని మూడు కీలక భూభాగాలను కలుపుకొని ఇటీవల విడుదల చేసిన నూతన మ్యాప్​ను చేర్చి పాఠశాల కొత్త పాఠ్య పుస్తకాలను విడుదల చేసింది.

ఇటీవల విడుదల చేసిన కొత్త పుస్తకాల్లో నూతన మ్యాప్​ను విద్యాశాఖ ఆధ్వర్యంలోని పాఠ్యాంశాల అభివృద్ధి కేంద్రం చేర్చినట్లు ఆ విభాగం సమాచార అధికారి గణేశ్​ భట్టారాయ్​ తెలిపారు.

9, 12వ తరగతుల కోసం 'నేపాల్​ భూభాగం, సరిహద్దు సమస్యలకు పఠన సామగ్రి' అనే పేరుతో కొత్త పుస్తకాలను విడుదల చేసింది. అందులో విద్యా శాఖ మంత్రి గిరిరాజ్​ మణి పోఖారెల్​ ముందుమాట రాశారు.

నాణాలపై...

కాలపానీ ప్రాంతాన్ని కలుపుకొన్నట్లు సూచించే నాణాలు ముద్రించాలని నేపాల్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశ కేంద్ర బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసింది. రూ.1, 2 నాణాలపై కొత్త మ్యాప్​ను ముద్రించేందుకు ప్రణాళికలు రచిస్తోంది బ్యాంకు.

మేలో విడుదల..

భారత్​ కొత్త మ్యాప్ విడుదల చేసిన ఆరు నెలలకు.. భారత్​లోని లిపులేఖ్, కాలపానీ సహా లింపియాధురా ప్రాంతాలను తమ పరిధిలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్​ను 2020 మేలో విడుదల చేసింది నేపాల్​. దానికి పార్లమెంట్​ ఆమోదముద్ర వేసింది.

కొత్త మ్యాప్​ను నేపాల్​ పార్లమెంట్​ ఆమోదించటాన్ని తప్పుపట్టింది భారత్​. నేపాల్​ ప్రాదేశిక వాదనలకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని, కృత్రిమ విస్తరణగా పేర్కొంది.

ఇదీ చూడండి:కాలాపానీ మాదేనంటూ నేపాల్ కొత్త మ్యాప్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details