మయన్మార్ వీధుల్లో మరణమృదంగం మోగింది. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై బలగాలు కాల్పులు జరిపాయి. ఈ హింసాత్మక ఘటనల్లో శనివారం ఒక్క రోజే 82 మంది మృతిచెందారని అక్కడి మీడియా వెల్లడించింది.
మయన్మార్ రక్తసిక్తం- ఒక్క రోజే 82 మంది మృతి
మయన్మార్లో సైనిక ప్రభుత్వ హింసకాండలో శనివారం ఒక్క రోజే 82 మంది మృతిచెందారు. అనధికారికంగా ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చని స్థానిక మీడియా పేర్కొంది.
మయన్మార్ రక్తసిక్తం- ఒకే రోజు 82 మంది మృతి
దేశంలోని బాగో, యాంగూన్ మొదలైన ప్రాంతాల్లో భద్రతా బలగాలు పేట్రేగిపోయాయి. శుక్రవారం బాగో పట్టణంలోని ఆందోళనకారులు.. పెద్ద సంఖ్యలో సైనిక కాల్పులకు బలయ్యారని స్థానికి మీడియా పేర్కొంది. సైనిక దుశ్చర్యలో ఇప్పటివరకు దాదాపు 701 మంది పౌరులు మృతిచెందినట్లు తెలిపింది.
ఇదీ చదవండి:కాబోయే కోడలు.. తన కూతురే అని తెలిస్తే?