తెలంగాణ

telangana

థాయిలాండ్​​: చివరి రోజు కీలక భేటీల్లో మోదీ

By

Published : Nov 4, 2019, 9:27 AM IST

తూర్పు ఆసియా, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య సదస్సుల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాల్గొననున్నారు. థాయిలాండ్​ పర్యటనలో ఉన్న మోదీ.. జపాన్​, వియత్నాం, ఆస్ట్రేలియా ప్రధానులతోనూ భేటీ కానున్నారు.

మోదీ

థాయిలాండ్​ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు కీలక భేటీలకు హాజరు కానున్నారు. తూర్పు ఆసియా కూటమితో పాటు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్​సీఈపీ) సదస్సుల్లో పాల్గొననున్నారు.

సదస్సులతో పాటు పలు దేశాధినేతలతోనూ బ్యాంకాక్​లో మోదీ భేటీ కానున్నారు. జపాన్​ ప్రధాని షింజో ఆబే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్​, వియత్నాం ప్రధాన మంత్రి గుయెన్ జువాన్​ ఫుస్​తో సమావేశమవుతారు.

ఆర్​సీఈపీ ఒప్పందం

ఆర్​సీఈపీ ఒప్పందానికి సంబంధించిన కీలక సమావేశంనేడు జరగనుంది. కూటమిలో భారత్​ చేరే విషయంపై సందిగ్ధం నెలకొన్న వేళ ఒప్పందంపైనా అనుమానాలు నెలకొన్నాయి. చైనా దిగుమతులపై వస్తోన్న అభ్యంతరాలను భారత్​ లేవనెత్తిన నేపథ్యంలో ఒప్పందం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details