తెలంగాణ

telangana

ETV Bharat / international

సిరియాలో ఉగ్రదాడి.. 9మంది మృతి

సెంట్రల్​ సిరియాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బస్సులపై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలికతో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.

By

Published : Jan 4, 2021, 9:29 AM IST

Militants attack bus in central Syria, killing 9
సిరియాలో ఉగ్రదాడి.. మృతుల్లో 13 ఏళ్ల బాలిక

సెంట్రల్​ సిరియాలో ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ప్రయాణించే బస్సును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలికతో సహా 9 మంది చనిపోయారని అక్కడి రాష్ట్ర మీడియా తెలిపింది. ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో దాడులకు తెగబడడం ఈ వారంలో ఇది రెండో సారి.

గత బుధవారం ఇళ్లకు వెళ్తున్న సైనికుల బస్సుపై కాల్పులకు ఒడిగట్టిన మిలిటెంట్లు.. 30 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఏడాది కాలంగా సిరియాపై ప్రాదేశిక నియంత్రణ కోల్పోయిన ఐఎస్​ ఉగ్రవాదులకు.. దేశంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో మాత్రం పట్టుంది.

ఈ దాడులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బస్సుతో పాటు చమురు ట్రక్కుపైనా దాడులు జరిగినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: 'న్యాయాధికారి కావాలంటే న్యాయవాదిగా అనుభవం ఉండాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details