మలేసియాలో జరిగిన 'తైపూసం హిందూ వార్షికోత్సవాల'కు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ దేశంలో ఇప్పటి వరకు 15మందికి సోకగా.. ఆ ప్రభావం ఉత్సవాలపై ఏ మాత్రం కనిపించలేదు. శిలంగూర్ రాష్ట్రం సున్నపురాతి కొండమీద బటు గుహల ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు వేలసంఖ్యలో మలేసియన్ హిందువులు హాజరయ్యారు.
272 మెట్లెక్కి ఆలయంలోకి...
ఈ ఉత్సవాలకు సుమారుగా పదిహేను లక్షల మంది హాజరవుతారని ఆలయ కమిటీ అంచనా వేసింది. అయితే శుక్రవారం రాత్రి నుంచి వారి అంచనాలు మరింత పెరిగాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 272 మెట్ల మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి మొక్కులు చెల్లించుకున్నారు.