తెలంగాణ

telangana

ETV Bharat / international

డ్రాగన్​పై రామబాణం- చైనాకు వ్యతిరేకంగా ట్వీట్ల వర్షం

లద్దాక్​లో ఘర్షణ అనంతరం భారత్​- చైనా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత్​కు మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు తైవాన్​, హాంకాంగ్​కు చెందిన నెటిజన్లు. వారు చేసిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్​గా మారాయి.

By

Published : Jun 18, 2020, 4:49 PM IST

Lord Rama takes on Chinese dragon, Taiwan News depiction goes viral
డ్రాగన్​ను చీల్చిచెండాడేందుకు సిద్ధమైన రాముడు..

భారత్​- చైనా సరిహద్దుల్లో దశాబ్దాల తర్వాత నెత్తురు పారింది. వాస్తవాధీన రేఖకు సమీపంలోని గాల్వన్​ లోయలో రెండు దేశాల సైనిక బృందాల మధ్య జరిగిన ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే చైనా దుశ్చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తైవాన్​, హాంకాంగ్​ దేశాల ప్రజలు భారత్​కు మద్దతిచ్చారు.

ఆయా దేశాలకు చెందిన కొందరు నెటిజన్లు.. చైనా తన బలానికి నిదర్శనంగా భావించే డ్రాగన్​పై భారత్​లో దేవుడిగా పూజించే రాముడు బాణం ఎక్కుపెట్టినట్లు గ్రాఫిక్​ ఫొటో​ రూపొందించారు. అవి కాస్తా అక్కడి సోషల్​ మీడియాతో పాటు భారత్​లోనూ వైరల్​ అవుతున్నాయి.​ ఆ ఫొటోపై "చంపుతాం.. జయిస్తాం" అనే స్లోగన్​ను రాసి పరోక్షంగా చైనాపై వ్యతిరేకత వ్యక్తం చేశారు అక్కడి ప్రజలు. అమెరికా, ఇంగ్లాండ్​, బెల్జియం, జపాన్​, భారత్​ మిత్రదేశాలని వారు పేర్కొన్నారు. ఈ ఫొటోలపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

హాంకాంగ్​ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జిన్​పింగ్​ ప్రభుత్వం.. ఇటీవల జాతీయ భద్రతా బిల్లును చైనా చట్టసభలో ఆమోదించింది. ఈ చర్యపై హాంకాంగ్​ వాసులు తీవ్ర నిరసనలు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details