తెలంగాణ

telangana

ETV Bharat / international

'మసూద్​ అంశం సముచితంగా పరిష్కారం అవుతుంది'

జైషే మహ్మద్ ఉగ్రసంస్థ​ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే అంశం సముచితంగా పరిష్కారమవుతుందని చైనా వ్యాఖ్యానించింది. పాక్​ ప్రధాని ఇమ్రాన్​తో చైనా అధ్యక్షుడు భేటీ అయిన రెండు రోజుల తర్వాత ఈ ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది.

By

Published : May 1, 2019, 6:02 AM IST

మసూద్​ అంశం సముచితంగా పరిష్కారం అవుతుంది: చైనా

మసూద్​ అంశం సముచితంగా పరిష్కారం అవుతుంది: చైనా

జైషే మహ్మద్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించకుండా అడ్డుకుంటున్న చైనా వైఖరిలో ఎట్టకేలకు మార్పు వచ్చినట్టుంది. మసూద్ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే అంశం సముచితంగా పరిష్కృతం అవుతుందని వ్యాఖ్యానించింది.

"మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే అంశం సముచితంగా పరిష్కారం అవుతుందని భావిస్తున్నా." - గెంగ్​ షుయాంగ్​, చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

ముంబయి వరుస పేలుళ్ల సూత్రధారి, పుల్వామా ఉగ్రదాడికి కారణమైన అజార్​ను ఎప్పటిలోగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తారనే విషయంపై డ్రాగన్ దేశం​ స్పష్టతనివ్వలేదు.

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ సమావేశమైన రెండు రోజులకే ఈ ప్రకటన వచ్చింది. మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో భారత్​, అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్ దేశాలు చైనాపై చాలా కాలంగా ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి.

ఇదీ చూడండి: న్యూజిలాండ్​లో బాంబు కలకలం

ABOUT THE AUTHOR

...view details