మయన్మార్- కాచిన్ రాష్ట్రంలోని హాపాకంత్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 123 మంది వరకు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జాడే మైనింగ్లో కూలీలు పనిచేస్తోన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. మట్టిదిబ్బల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంలో సుమారు 200 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక మీడియా ఓ వెబ్సైట్లో పేర్కొంది.