తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తేలేదు'

అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్​ యో జోంగ్​ స్పష్టం చేశారు.

By

Published : Jun 22, 2021, 12:40 PM IST

NKOREA
ఉత్తర కొరియా

అమెరికాతో ఉత్తరకొరియా చర్చలకు సిద్ధంగా ఉందని వచ్చిన వార్తల్ని..ఆ దేశ అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ సోదరి కిమ్​ యో జోంగ్ కొట్టిపారేశారు. ఈ విషయంలో అమెరికా పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు.

అమెరికాతో చర్చలకైనా, పోట్లాటకైనా సిద్ధమేనని..ఎక్కువగా ఘర్షణకే సిద్ధమని ఉత్తరకొరియా అధ్యక్షుడు అన్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్​ సలివన్​ మంగళవారం అన్నారు. చర్చలకు సిద్ధం అనడాన్ని మంచి పరిణామంగా ఆయన పేర్కొన్నారు.

అయితే అమెరికాతో చర్చలపై ఉత్తర కొరియా నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు యూఎస్ తరపు​ నార్త్​ కొరియా వ్యవహారాల రాయబారి సంగ్​ కిమ్​ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details