గురునానక్దేవ్ 550వ జయంతి వేడుకల కోసం సిక్కు యాత్రికులను స్వాగతించడానికి కర్తార్పుర్ సిద్ధంగా ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కర్తార్పుర్ సముదాయం (కాంప్లెక్స్), గురుద్వారా దర్బార్ సాహిబ్ చిత్రాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నవంబర్ 9న కర్తార్పుర్ నడవా ప్రారంభం కాబోతోంది.
"సిక్కు యాత్రికులను స్వాగతించడానికి కర్తార్పుర్ సిద్ధంగా ఉంది."- ఇమ్రాన్ఖాన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి
కర్తార్పుర్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసిన ప్రభుత్వ అధికారులను కూడా ఇమ్రాన్ఖాన్ అభినందించారు.