తెలంగాణ

telangana

ETV Bharat / international

'సిక్కు యాత్రికులకు స్వాగతం చెప్పేందుకు కర్తార్​పుర్ సిద్ధం' - కర్తార్​పుర్​పై ఇమ్రాన్​ఖాన్​ ప్రకటన

సిక్కు యాత్రికులను స్వాగతించడానికి కర్తార్​పుర్ సిద్ధంగా ఉందని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ వెల్లడించారు. కర్తార్​పుర్​ నడవా వల్ల గురునానక్​దేవ్ 550వ జయంతి ఉత్సవాల్లో సిక్కు భక్తులు పాల్గొనే అవకాశం కలిగింది. నవంబర్​ 9 కర్తార్​పుర్​ నడవా ప్రారంభం కానుంది.

సిక్కు యాత్రికులకు స్వాగతం చెప్పేందుకు కర్తార్​పుర్ సిద్ధం

By

Published : Nov 3, 2019, 2:27 PM IST

Updated : Nov 3, 2019, 4:32 PM IST

'సిక్కు యాత్రికులకు స్వాగతం చెప్పేందుకు కర్తార్​పుర్ సిద్ధం'

గురునానక్​దేవ్​ 550వ జయంతి వేడుకల కోసం సిక్కు యాత్రికులను స్వాగతించడానికి కర్తార్​పుర్​ సిద్ధంగా ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కర్తార్​పుర్ సముదాయం (కాంప్లెక్స్), గురుద్వారా దర్బార్ సాహిబ్ చిత్రాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నవంబర్ 9న కర్తార్​పుర్​ నడవా ప్రారంభం కాబోతోంది.

"సిక్కు యాత్రికులను స్వాగతించడానికి కర్తార్​పుర్ సిద్ధంగా ఉంది."- ఇమ్రాన్​ఖాన్, పాకిస్థాన్​​ ప్రధానమంత్రి

కర్తార్​పుర్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసిన ప్రభుత్వ అధికారులను కూడా ఇమ్రాన్​ఖాన్ అభినందించారు.

సిక్కు మత వ్యవస్థాపకుడైన గురునానక్​ అవిభక్త భారత్​ (నేడు పాకిస్థాన్​)లోని నంకనా సాహిబ్​లో జన్మించారు. ఈ ఏడాది ఆయన 550వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కర్తార్​పుర్ నడవా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కలిగింది.

పాక్ పర్యాటకం

పాకిస్థాన్​లోని సిక్కు పవిత్ర ప్రదేశాలకు సిక్కులను ఆకర్షించడం ద్వారా మత పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నది ఇమ్రాన్​ఖాన్​ ఆలోచనగా కనిపిస్తోంది.

ఇదీ చూడండి: 'భారత్​-ఆసియాన్​ దేశాల పరస్పర సహకారంతోనే ఆర్థికాభివృద్ధి'

Last Updated : Nov 3, 2019, 4:32 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details