అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి రికార్డు నెలకొల్పాడు నేపాల్కు చెందిన కమీ రీటా షెర్పా. గతేడాది 22వ సారి ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సాధించిన షెర్పా... 23వసారీ అధిరోహించి తన రికార్డును తానే బదలుకొట్టాడు. 49 ఏళ్ల కమీ... ఇతర షెర్పాలతో కలిసి 8,850 మీటర్లు ఎత్తైన శిఖరాన్ని అధిరోహించాడు.
"నేపాల్లోని సొలుఖుంబు జిల్లాలోని థేమ్ గ్రామస్థుడు కమీ రిటా షెర్పా. బుధవారం ఉదయం 7.50గంటలకు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. నేపాల్ వైపునుంచి అధిరోహించిన షెర్పా.. ఎవరెస్ట్ అత్యధికసార్లు అధిరోహించిన వ్యక్తిగా తన రికార్డు తానే అధిగమించాడు."
-మింగ్మా షెర్పా, సెవన్ సమ్మిట్ ట్రెక్స్ సంస్థ అధినేత