తెలంగాణ

telangana

ETV Bharat / international

'వివాదాలు సహజమే.. చర్చల ద్వారా పరిష్కరించుకుందాం' - మోదీ-జిన్​పింగ్ రెండో అనధికార భేటీ

చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ సమావేశానికి ముందు.. ఆ దేశ రాయబారి సన్ ఉయ్​డోంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుగుపొరుగు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు సహజమేనని.. చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని డ్రాగన్ ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

'వివాదాలు సహజమే.. చర్చల ద్వారా పరిష్కరించుకుందాం'

By

Published : Oct 8, 2019, 10:38 PM IST

భారత్​-చైనా దేశాల మధ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుని, శాంతి సుస్థిరతలను నెలకొల్పాలని చైనా రాయబారి సన్​ ఉయ్​డోంగ్ ఆకాంక్షించారు. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్.. రెండోసారి అనధికారంగా భేటీ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్​, చైనాలు సానుకూల దృక్పథంతో వ్యత్యాసాలను, విభేదాలను దాటి.. అభివృద్ధి దిశగా కలిసి అడుగులు వేయాలని ఉయ్​డోంగ్ అన్నారు.

ఇరుగుపొరుగు అన్నాక సహజమే

పరస్పర రాజకీయ విశ్వాసాలు, వ్యూహాత్మక సంబంధాల బలోపేతం దిశగా మోదీ-జిన్​పింగ్ చర్చలు జరుపుతారని ఉయ్​డోంగ్ తెలిపారు. ఇరుగుపొరుగు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు సాధారణమేనని.. చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడమే ఉత్తమం అని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దు వివాదం.. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపాలని తాము కోరుకోవడంలేదని ఆయన వివరించారు.

ఇదీ చూడండి:రావణుడికి విల్లు ఎక్కిపెట్టిన ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details