తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​కు జపాన్​ రూ.2,113 కోట్ల ఆర్థిక సాయం - కొవిడ్​పై పోరాటంలో భారత్​కు ఆర్థిక సాయం

కొవిడ్​పై పోరాటంలో భాగంగా భారత్​కు రూ. 2,113 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది జపాన్. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కొవిడ్​ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్​లోని నిరుపేదల కోసం జపాన్​ ఈ సాయం చేస్తోంది.

Japan gives loan to India for Covid-19 support
భారత్​కు రూ.2,113 కోట్ల ఆర్థిక సాయం చేయనున్న జపాన్

By

Published : Jan 9, 2021, 10:48 PM IST

కొవిడ్​ సంక్షోభంలో భారత్​కు ఆర్థిక సాయం చేసేందుకు జపాన్ ముందుకొచ్చింది. దాదాపు రూ.2,113 కోట్లు రుణంగా ఇవ్వనుంది. 'అధికారిక అభివృద్ధి సాయం' పేరిట రెండు దేశాల మద్య ఒప్పందం కుదిరింది.

భారత ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి సీఎస్ మొహాపాత్రా, జపాన్ రాయబారి సుజుకీ సతోషి ఈ విషయంపై శుక్రవారం చర్చించారు. ఈ నేపథ్యంలో మొహాపాత్రా, జేఐసీఎ ముఖ్య ప్రతినిధి కట్సువో మట్సుమోటో ఒప్పందంపై సంతకాలు చేశారు.

కొవిడ్​ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్​లోని పేదలకు అండగా ఉండేందుకు జపాన్​ ఈ ఆర్థిక సాయం అందిస్తోంది.

ఇదీ చదవండి:అమెరికా... ఇది చైనా కాదు: నిక్కీ హేలీ

ABOUT THE AUTHOR

...view details