తెలంగాణ

telangana

ఒంటరితనంపై పోరుకు ప్రత్యేక మంత్రి

By

Published : Feb 23, 2021, 2:35 PM IST

జపాన్​లో ఆత్మహత్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దేశంలో అనేకమంది ఒంటరితనం, అందరికీ దూరంగా ఉండటం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మినిస్టర్​ ఆఫ్​ లోన్లీనెస్​ను నియమించింది.

Japan appoints minister of loneliness to tackle suicides in country
మినిస్టర్​ ఆఫ్​ లోన్లీనెస్​

పెరుగుతున్న ఆత్మహత్యలను నియంత్రించేందుకు జపాన్​ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 'మినిస్టర్​ ఆఫ్​ లోన్లీనెస్​'ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు జపాన్​ ప్రధానమంత్రి యోషిహిదె సుగా.

టెట్సుషి సకమోటోకు ఒంటరితనం శాఖ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు సుగా. ప్రభుత్వంలో ఆయన ఇప్పటికే పలు బాధ్యతల్లో ఉన్నారు. తగ్గుతున్న జననాల రేటును పెంచడం, రీజనల్​ రీవిటలైజేషన్​పై ప్రచారం నిర్వహించడం, ఒంటరితనం, సోషల్​ ఐసోలేషన్​ వంటి వ్యవహారాలు చూసుకుంటున్నారు సకమోటో.

ఒంటరితనం...

జపాన్ ప్రజల్లో ఒంటరితనం, అందరికీ దూరంగా ఉండటం వంటివి అతి పెద్ద సమస్యలుగా మారాయి. వీటిని పరిష్కరించేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఓ రోబో​ను సృష్టించి... ఒంటరితనంతో బాధపడుతున్న వారికి తోడుగా.. వారి చెయ్యి పట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదు.

కరోనా సంక్షోభంలో..

సాధారణంగానే అత్మహత్యలు ఎక్కువగా ఉండే జపాన్​లో కరోనా వైరస్​ సృష్టించిన అలజడుల వల్ల పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. 11ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆత్మహత్యల్లో పెరుగుదల నమోదైంది.

2020లో అక్టోబర్​ నాటికి.. కరోనాతో మరణించిన వారి కన్నా.. కేవలం ఆ ఒక్క నెలలో ఆత్మహత్యల వల్ల ప్రాణాలు బలితీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం పరిస్థితులకు అద్దం పడుతోంది. అక్టోబర్​లో 2,153 మంది ఆత్మహత్య చేసుకోగా.. అప్పటివరకు వైరస్​తో మృతి చెందిన వారి సంఖ్య 1,765 ఉండటం గమనార్హం. ఈ వివరాలను జపాన్​ జాతీయ పోలీసు సంస్థ వెల్లడించింది.

గుండె సమస్యలు, డిమెన్షియా, ఎక్కువగా తినే అలవాటు వంటివి ఆత్మహత్యకు దారితీస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా మహిళల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. అక్టోబర్​లో 879మంది మహిళాలు ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో నమోదైన వాటి కన్నా ఇది 70శాతం అధికం.

తొలిసారిగా..

మినిస్టర్​ ఆఫ్​ లోన్లీనెస్​ను తొలిసారిగా 2018లో బ్రిటన్​ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒంటరితనంలో కూరుకుపోతున్నట్టు.. దేశంలోని 90 లక్షల మంది భావిస్తున్నారన్న ఓ నివేదికతో ఈ చర్యలు చేపట్టింది. అయితే మూడేళ్లలో ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు మారారు.

ఈ తరహా మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలని ఆస్ట్రేలియా కూడా యోచిస్తోంది.

ఇదీ చూడండి:-జపాన్ 'ట్విట్టర్​‌ కిల్లర్‌'కు మరణశిక్ష

ABOUT THE AUTHOR

...view details