తెలంగాణ

telangana

ETV Bharat / international

నేడు భూటాన్ పర్యటనకు​​ విదేశాంగ మంత్రి

విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ భూటాన్​ పర్యటన చేయనున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు భూటాన్​ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా భూటాన్​ ప్రధాని, విదేశాంగశాఖ అధికారులతో చర్చలు జరపనున్నారు.

By

Published : Jun 7, 2019, 6:41 AM IST

Updated : Jun 7, 2019, 8:17 AM IST

భూటాన్ పర్యటనకు​​ విదేశాంగ మంత్రి జయ్​శంకర్​

భూటాన్ పర్యటనకు​​ విదేశాంగ మంత్రి జయ్​శంకర్​

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్​. జయ్​శంకర్​ తన తొలి విదేశీ పర్యటనను ప్రారంభించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు భూటాన్​లో పర్యటిస్తారని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్ తెలిపారు. పర్యటనలో భాగంగా భూటాన్​ ప్రధానమంత్రితో పాటు విదేశాంగ అధికారులతో సమావేశం కానున్నారు జయ్​శంకర్​​. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయని రవీశ్ కుమార్ ప్రకటించారు.

సుష్మా స్వరాజ్​ అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మంత్రి వర్గంలో విదేశాంగశాఖ మంత్రిగా జై​శంకర్​ బాధ్యతలు చేపట్టారు. అనంతరం తన తొలి విదేశీ పర్యటన భూటాన్​లో చేయనున్నారు.

ఇదీ చూడండి : కేంద్రంలో 'నెం-2' అమిత్​ షా యేనా?

Last Updated : Jun 7, 2019, 8:17 AM IST

ABOUT THE AUTHOR

...view details