కరోనా వ్యాక్సిన్కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు ఇజ్రాయెల్ పరిశోధకులు. వైరస్లోని అణువులకు రోగ నిరోధక వ్యవస్థను ప్రతిస్పందింపజేసి యాంటీబాడీలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ అణువులను కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఉపయోగించవచ్చని తెలిపారు.
ఇజ్రాయెల్లోని బార్ ఇలాన్ యూనివర్సిటీ(బీఐయూ) పరిశోధకుల అధ్యయనం ఎంపీడీఐ వ్యాక్సిన్స్ జర్నల్లో ప్రచురితమైంది. దీని ప్రకారం కరోనా వైరస్లోని ప్రతిజనక అణువులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇవి రోగ నిరోధక ప్రతిస్పందనలో యాంటీబాడీలను ఉత్పత్తి చేయగలవు.