తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2019, 11:39 PM IST

ETV Bharat / international

బాగ్దాదీ పోయాడు.. ఇప్పుడు మా నాయకుడు​ ఖురేషీ: ఐసిస్​

ఐసిస్​ నూతన అధిపతిగా అబి ఇబ్రహీం అల్​ హషీమి అల్​ ఖురేషీని ప్రకటించింది ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రసంస్థ. అలాగే అబూబకర్​ మరణాన్ని ధ్రువీకరిస్తూ.. ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేసింది. బాగ్దాదీ మరణంతో అమెరికా సంతోషించాల్సిన అవసరం లేదని హెచ్చరించింది.

బాగ్దాదీ చచ్చాడు.. ఇప్పుడు మా నాయకుడు​ ఖురేషీ: ఐసిస్​

ఐసిస్​ అధినేత అబూబకర్​ అల్​ బాగ్దాదీ మరణించినట్లు ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రసంస్థ ధ్రువీకరించింది. బకర్ వారసుడిగా అబి ఇబ్రహీం అల్​ హషీమి అల్​ ఖురేషీ.. ఐసిస్​ను​ నడిపించనున్నాడని ఓ ఆడియో సందేశంలో స్పష్టం చేసింది. ఐసిస్​ ప్రధాన మీడియా మాధ్యమం అల్​ ఫుర్ఖాన్​ ఫౌండేషన్ ద్వారా ఈ ఆడియోను విడుదల చేసింది.

బాగ్దాదీతో పాటు ఆ సంస్థ అధికార ప్రతినిధి, బాగ్దాదీకి అత్యంత సన్నిహితుడైన అబు హసన్​ అల్ ముహాజిర్​ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అలాగే 'బాగ్దాదీ మరణంతో అమెరికన్లు సంతోషించకండి' అని హెచ్చరించింది.

బాగ్దాదీని మట్టుబెట్టిన అమెరికా

సిరియా వాయువ్యరాష్ట్రం ఇడ్లిబ్​లో అమెరికా దళాలు జరిపిన ఆపరేషన్​లో బాగ్దాదీ హతమయ్యాడు. యూఎస్ దళాల నుంచి రక్షించుకోవడానికి ఓ సొరంగంలోకి వెళ్లి.. తన ఇద్దరు పిల్లలను కాల్చిన అనంతరం ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని గంటలకు జరాబ్లష్​లో ఐసిస్​ అధికార ప్రతినిధి అల్​ ముహాజిర్​ను కుర్దీష్ దళాలతో కలిపి అమెరికా సైన్యం మట్టుబెట్టింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details