తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంక ఉగ్రదాడులు మా పనే: ఐసిస్​

శ్రీలంకలో ఈస్టర్​ పర్వదినాన జరిగిన ఉగ్రకాండ తమ పనేనని ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాద సంస్థ (ఐసిస్​) ప్రకటించింది. ఈ దాడుల్లో 321 మంది పౌరులు మరణించగా 500 మంది గాయపడ్డారు.

By

Published : Apr 23, 2019, 5:29 PM IST

Updated : Apr 23, 2019, 10:48 PM IST

శ్రీలంక ఉగ్రదాడులు

శ్రీలంక దాడులపై ఐసిస్​ ప్రకటన

శ్రీలంక ఉగ్రదాడులు చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రవాద సంస్థ(ఐసిస్​) ప్రకటించింది. జిహాదీల కార్యకలాపాలను పరిశీలించే ఓ వార్తా సంస్థ విషయాన్ని తెలిపిందని ఇంటెలిజెన్స్​ వెబ్​సైట్​ పేర్కొంది.

అనుమానితుల దృశ్యాలు విడుదల

ఈస్టర్​ రోజు జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఏడుగురు పాల్గొన్నట్టు సమాచారం. ఇప్పటికే నలభై మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇందులో ఆత్మహుతి సభ్యులు వాడిన వ్యాన్​ డ్రైవర్​ కూడా ఉన్నాడు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కొలంబోలోని సెయింట్​ సెబాస్టియన్​ చర్చి, నెగాంబోలని సెయింట్​ ఆంటోనీ చర్చిలోకి ఆత్మాహుతి దళ సభ్యుడు బ్యాగుతో వెళ్లిన దృశ్యాలు బహిర్గతం చేశారు.

ఇదీ చూడండి: 'న్యూజిలాండ్​ దాడికి శ్రీలంకలో ప్రతీకారం'

Last Updated : Apr 23, 2019, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details